prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:27 am Digital Edition : MEERASAHAB CHILUKUR

లైసెన్స్డ్ సర్వేర్లను తోరగా విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనం ప్రకటించాలి*

చిలుకూరు జూలై 11(ప్రజావాణి*): రైతులకు మేలు చేయాలి అని, భూ సమస్యలకు శాశ్వత  పరిష్కారం చూపించుతామని  తెలంగాణ ప్రభుత్వం భూభారతి  యాక్ట్ 2025 తీసుకువచ్చింది దీనిలో భాగంగా రాష్ట్రంలో 10,500 మందికి సర్వేయర్లకు  శిక్షణ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 6500 మందికి  లైసెన్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా జారీ చేసి మండలాలను అలర్ట్ చేశారు.కానీ ఒక్క సంవత్సరం అవుతున్నా వర్క్ ఎలట్ చేయకుండా జీతం లేకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి లైసెన్స్  సర్వేర్లను విధుల్లోకి తీసుకొని కమిషన్ విధానాన్ని రద్దు చేసి నెల వారి గౌరవ వేతనం 30000/- ప్రకటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మా లైసెన్స్ సర్వేయర్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా న్యాయం చేసేలా చూడాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,సిపిఐ పార్టీ రాష్ట్ర , సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీను  సూర్యాపేట జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోను సాహెబ్, జిల్లా ప్రెసిడెంట్ పసర బోయిన నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ అంజనపల్లి రవి,ట్రెజరర్ యశ్వంత్ వినతి పత్రం అందజేశారు.