prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 3:11 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

లింగాల – పులివెందుల రూట్‌లో బస్సులు నిలుపుదల చేయక ప్రజల ఆవేదన

కడప జిల్లా మే19 ప్రజావాణి ,పులివెందుల రూట్‌లో ఆర్టీసీ బస్సుల వ్యవహారం పట్ల స్థానిక ప్రజలకు ఆర్టీసీ సేవలపై పెరుగుతున్న అసంతృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే,పథకం అమలు విషయంలో ఆర్టీసీ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకంగా  ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయించిన స్టేజీల వద్ద బస్సులు ఆగకుండా నేరుగా వెళ్లిపోతున్నాయని మహిళలు,వృద్ధులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉచిత బస్సు పథకం ఉన్నా, బస్సు ఆగకపోతే ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.గ్రామాల వద్ద బస్సులు నిలపాలని పలుమార్లు డ్రైవర్లు, కండక్టర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్నిసార్లు మహిళలు చేతులు ఊపినా బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో పాఠశాలలు,కళాశాలలు,ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు ఈ సమస్యపై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.“ఉచిత ప్రయాణం ప్రకటించడం మాత్రమే కాకుండా, సరైన సేవలు అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి” అని స్థానికులు కోరుతున్నారు.రవాణా సదుపాయాలు గ్రామీణ ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు సమర్థవంతంగా ఉండాలంటే, బస్సులు ప్రతి నిర్ణయిత స్టాప్ వద్ద ఆగేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి లింగాల  పులివెందుల రూట్‌లో సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు