prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:56 pm Digital Edition : RAKESH PEDDAPALLY

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టిపిసి లోని సాయి సేవా సమితికి సహాయక కార్యక్రమం

రామగుండం ఆగస్టు 1 ప్రజావాణి :

రామగుండం కార్పొరేషన్ ఎన్టిపిసి లో ఉన్నటువంటి సాయి సేవా సమితికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 50కుర్చీలు వితరణ చేయడం జరిగింది. జెడ్సి లయన్ కొమురవెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ మోర భద్రేశం పిఎంజెఎఫ్, డిస్ట్రిక్ట్ గవర్నర్, అతిథులుగా లయన్ వల్లాల క్రిష్ణ హరి డిసిఎస్, లయన్ నార్ల ప్రసాద్ ఎంజెఎఫ్, లియో టూ లయన్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, లక్ష్మయ్య (మైక్రో క్యాబినేట్) హాజరయ్యారు. ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్పూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని లక్ష్మీనగర్,

లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి క్లబ్బులను సాయి సేవా సమితి చేస్తున్నటువంటి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి శ్రీధర్ (ఐ స్క్రీనింగ్ క్యాంప్స్), క్లబ్ పిఎస్టి లయన్స్ కోదాటి ప్రవీణ్, అనుగం కృష్ణమూర్తి, దొండపాటి మహేందర్ రెడ్డి, కొమురవెల్లి రాహుల్, చిట్టిమల్ల కిషొర్, సెక్రటరీస్ లయన్స్ ఎతిరాజ్ సురేష్, ఇల్లెందుల శ్రీనివాస్, ట్రెజరర్స్ లయన్స్ రెడ్డి రవీందర్ రెడ్డి, చింతకింది కృష్ణ, ధరణి పోశం, దొంతుల గంగాధర్, కొమురవెల్లి రోహిత్, బుర్ర దేవెందర్ గౌడ్, కొమురవెల్లి రవితేజ, సాయి సేవా సమితి జనరల్ సెక్రటరీ బయ్యపు అశోక్ రెడ్డి, వేణు, బుర్ర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.