prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 3:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

లంచగొండి వీఆర్వోలను సస్పెండ్ చేస్తే సరిపోదు.శాశ్వతంగా డిస్మిస్ చేయాలి! నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కవలకుంట్ల మధుబాబు డిమాండ్ చేశారు

రెవెన్యూ శాఖలో లంచాల చీడపురుగులు.సామాన్యుల రక్తం తాగుతున్న అవినీతి తిమింగలాలు!పుల్లవీడు వీఆర్వో సునీతపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు కవలకుంట్ల మధుబాబు!

అవినీతిపై తిరగబడండి.. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు ఫిర్యాదు చేయండి! 

పోరుమామిళ్ల (జులై 23 ప్రజావాణి)భూమి మ్యుటేషన్ కోసం ఒక సామాన్య రైతును రూ.2 లక్షల భారీ లంచం డిమాండ్ చేస్తూ,వాట్సప్ చాటింగ్‌తో అడ్డంగా దొరికిపోయిన పుల్లవీడు వీఆర్వో సునీతను కేవలం సస్పెండ్ చేయడం కంటితుడుపు చర్యేనని,ఆమెను తక్షణమే ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ (తొలగించడం) చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కవలకుంట్ల మధుబాబు ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

సస్పెన్షన్లు లంచగొండులకు సెలవులు లాంటివి!

ఈ సందర్భంగా కవలకుంట్ల మధుబాబు మాట్లాడుతూ,ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో లంచాల వ్యాప్తి క్యాన్సర్‌లా పాకిపోయిందని మండిపారు.లంచం తీసుకుంటూ దొరికిపోయిన సస్పెండ్ చేయడం అంటే.. వారికి జీతంతో కూడిన సెలవులు ఇచ్చినట్లే అవుతుందని తీవ్రంగా విమర్శించారు.కొద్దిరోజుల తర్వాత వీరు మళ్లీ అదే సీట్లలో కూర్చుని, అంతకంటే రెట్టింపు వేగంతో లంచాలు నములుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పుల్లవీడు వీఆర్వో సునీతపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా,ఉన్నతాధికారులు హెచ్చరించినా ఆమెలో మార్పు రాకపోవడం వ్యవస్థల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.

రైతుల రక్తాన్ని పిండుతున్న పిశాచాలు:

కన్నతల్లి చనిపోతే, ఆమెకున్న ఏకైక కుమార్తె పేరు మీద పొలాన్ని ఆన్‌లైన్ (మ్యుటేషన్) చేయడానికి ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేయడం కసాయి చర్య కాదా? అని ఆయన ప్రశ్నించారు.కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్య ప్రజలను,రైతులను పీడించుకు తింటున్న ఇలాంటి లంచగొండి వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఇంకా వందల సంఖ్యలో ఉన్నారని ఆరోపించారు. లంచగొండుల గుండెల్లో వణుకు పుట్టాలంటే,లంచం అడిగిన క్షణమే వారిని జైలుకు పంపి,శాశ్వతంగా ఉద్యోగాల నుండి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశారు.అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం-లంచం అడిగితే 14400 కి కాల్ చేయండి ప్రజలు ఎవరూ అవినీతి అధికారులకు లంచాలు ఇచ్చి వారిని పెంచి పోషించవద్దని మధుబాబు పిలుపునిచ్చారు.ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే ప్రభుత్వ అధికారిక ఏసీబీ (ACB) టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు ఫోన్ చేసి లేదా’ACB AP’మొబైల్ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు.బాధితుడు వినయ్‌కుమార్ స్క్రీన్‌షాట్‌తో తిరగబడినట్లే,ప్రతి ఒక్కరూ అవినీతిపై తిరగబడాలన్నారు.ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి హెచ్చరిక:ఆరోపణలు నిజమని తేలి వీఆర్వో సునీతపై కలెక్టర్ కేవలం సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటే కుదరదని,ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేసి,అక్రమ ఆస్తులపై ఏసీబీ (ACB) దర్యాప్తు జరిపించాలని మధుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులను వేధిస్తున్న అవినీతి భరతం పట్టకపోతే,నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవలకుంట్ల మధుబాబు హెచ్చరించరు,