prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:23 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

రోప్ స్కిప్పింగ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహణ

ఘట్‌కేసర్, ఏప్రిల్ 24 (ప్రజావాణి): హైదరాబాద్ రీజన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్ — 2025 కార్యక్రమం రెండు రోజుల పాటు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, ఘట్‌కేసర్‌లో ఘనంగా జరిగింది.

హైదరాబాద్ రీజన్‌కు చెందిన 12 కేంద్రీయ విద్యాలయాల నుండి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో బాలబాలికలు తమ ప్రతిభను చాటుకున్నారు.

కేవీఎస్ హైదరాబాద్ రీజన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ ఎన్. సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎన్‌ఎఫ్‌సీ నగర్ ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. హరి ప్రసాద్ ముఖ్య అతిథిని ఆహ్వానించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. పీఈటీలు శ్రీ బీవీడీ పవన్ కుమార్, శ్రీ తిరుమల చార్యులు మరియు పాఠశాల సిబ్బంది కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

ఈ పోటీలలో విద్యార్థులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ రీజినల్ స్పోర్ట్స్ మీట్ కేవీఎస్ హైదరాబాద్ రీజన్‌లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసింది.