రోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ
ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్లపల్లికి చెందిన పత్తిపాక మునిలత మృతి చెందగా. శనివారం బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, తాటిపర్తి శైలేందర్ రెడ్డి పరామర్శించి, రూ. 7 వేల ఆర్థిక సాయం అందించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.