రైతు వేదికల్లో నేటి నుండి విత్తన మేళా, రైతులకు వ్యవసాయాధికారి పిలుపు
ఎండపల్లి మండలంలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 23 నుండి 30 వరకు విత్తన మేళా నిర్వహించనున్నారు. ఇందులో ప్రభుత్వ గుర్తింపు పొందిన బీపీటీ 5204, తెలంగాణ సోన, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, కేఎన్ఎం రకాల వరి విత్తనాలతో పాటు కందులు, పెసర్లు, మినుములు, కూరగాయల విత్తనాలు విక్రయించనున్నారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉంటాయని, రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కామల్ల మహేష్ కోరారు.