మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ప్రస్తుతం సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రైతులకు సమయానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం నిధులు ఆలస్యమవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేయాలని కోరారు.వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రైతుల సమస్యలను గుర్తించి రైతు బంధు నిధులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.