prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 9:48 am Digital Edition : PRAJA VANI

రైతు ఆశీర్వాద సభను తమ ఇంటి పండగలా ప్రతి రైతు భావించి కుటుంబ సమేతంగా తరలి రావాలి .

💥 *రైతు ఆశీర్వాద సభను తమ ఇంటి పండగలా ప్రతి రైతు భావించి కుటుంబ సమేతంగా తరలి రావాలి .* …

*మధిర నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా రైతులు సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు …. డిప్యూటీ సీఎం భట్టి*

.
*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 9*

  మధిర లోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల తో మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రైతుల ఆశీర్వాదం కోసం రేపు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వస్తున్నారని భట్టి తెలిపారు. జిల్లా నుంచి మూడు లక్షల పైగా హాజరయ్యే ఈ సభలో మధిర నియోజకవర్గ నుండే లక్ష్యకు పైగా ప్రజలు, రైతులు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సభ కోసం మధిర నియోజకవర్గ నుండి 1100 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఇవే కాకుండా అనేక ట్రాక్టర్లు, ఆటోలు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజల కోసం ఏర్పాటు చేశారని ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా సభకు వచ్చి వెళ్లేలా పకడ్బందీగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.