బెజ్జంకి, జూలై 29 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మండల అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కడివెర్గు ప్రవీణ్తె లిపారు.మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన శాఖ, జలసిరి కార్యక్రమం, పశుసంవర్ధక శాఖ, వైద్య–ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, విద్యాశాఖ, ఐకేపీ తదితర శాఖల పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మండలస్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలతో ఉదయం 11 గంటలకు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు. అభివృద్ధి పనుల పురోగతితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.