ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో రేపు (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బూత్లలో పోలియో చుక్కలు వేయనున్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మండల వైద్యాధికారి లవకుమార్ కోరారు.