రాజేశ్వరపురం నిర్లక్ష్య రోగం…
తెలంగాణ ఆవిర్భావం కూడా పట్టించుకోరా
పత్తాలేని సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని రాజేశ్వర పురం పల్లె దవాఖానకు నిర్లక్ష్య రోగం వచ్చిందని స్థానికులు మండల ప్రజలు బహిరంగ ఆరోపిస్తున్నారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన సిబ్బంది కనీసం పెదగా పట్టించుకోకపోవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేళ పడలేదా సెంటర్ కు తాళం వేసి సిబ్బంది అందుబాటులో లేకపోవడం విశేషం.. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి విచారణ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ పల్లె దవాఖాలను పర్యవేక్షించే వైద్యులు పెద్దగా పట్టించుకోవటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.. ఇటువంటి మరికొన్ని అంశాలతో.. వివరాలతో రేపటి కథనం
లో వేచి చూడండి…!



