ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో ఈ రోజు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభ ఘనంగా జరిగింది. సర్పంచ్ సంఘ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వర్షాకాల జాగ్రత్తలు, వరద నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, జల సంరక్షణపై చర్చించారు. హరితహారం, ఓటర్ల జాబితా సవరణ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లపై అధికారులు ప్రజల విన్నపాలను స్వీకరించి, పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, తహసిల్దార్ అనిల్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.