రాజరాంపల్లిలో పిడుగుపాటుకు గేదె మృతి
ఎండపల్లి మండలం రాజరాంపల్లి హనుమాన్ గుడి సమీపంలో ఈరోజు కురిసిన వర్షానికి సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడుగుపాటుతో మాచర్ల కుమారస్వామికి చెందిన ఆరేళ్ల గేదె చనిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పశువైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ తో కలిసి ప్రాథమిక విచారణ జరిపారు. ఆ గేదె మార్కెట్ విలువ సుమారు ఎనభై వేల రూపాయలు ఉంటుందని వెటర్నరీ డాక్టర్ బూర మనోజ్ కుమార్ తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.