prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 4:07 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

యూత్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 05 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో బుధవారం రోజున స్థానిక గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కూరి గణేష్, యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కి వెళ్ళే రహదారి, చౌరస్తా మూల మలుపు వద్ద పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరిగి రాకపోకలకు ఇబ్బంది కలగడం వల్ల యూత్ సభ్యులు సమిష్టిగా కృషి చేసి అట్టి చెట్లను ప్రోక్లేను సహాయంతో తొలగించటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, గణేష్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చెల్పూరి రమేష్, కట్కూరి శేఖర్, బండారి రాకేష్, బండారి సంతోష్ తదితరులు  పాల్గొన్నారు.