యాతవాకిళ్ళ గ్రామపంచాయతీని సందర్శించిన నూతన ఎమ్మార్వో హిమబిందు.
ఎమ్మార్వో ని ఘనంగా సన్మానించిన గ్రామ సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు మరియు పెద్దలు.
ప్రజావాణి న్యూస్ మఠంపల్లి. మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామాన్ని నూతన ఎమ్మార్వో హిమబిందు గ్రామ సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించి గ్రామంలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కొత్త గృహాలను సందర్శించి వాటికి గల మౌలిక వసతులను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అనంతరం గ్రామ సచివాలయానికి చేరుకున్న తర్వాత గ్రామ సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు మరియు గ్రామ పెద్దలు కలిసి మొదటిసారిగా విచ్చేసిన ఎమ్మార్వో ని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జానీ మరియు రెవెన్యూ సిబ్బంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ బొమ్మకంటి బాలనాగయ్య బండి వెంకటరెడ్డి కీసర వెంకన్న. వార్డు నెంబర్ భాస్కర్ మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
