prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:14 am Digital Edition : PRAJA VANI

యాతవాకిళ్ళ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ ఏఈ  జగదీష్

ప్రజావాణి న్యూస్ మఠంపల్లి. మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామంలో  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కుక్కల కరుణా నాగరాజు ఆధ్వర్యంలో హౌసింగ్ ఏఈ జగదీష్ తనిఖీ చేసి వాటిలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల కరుణా నాగరాజు మాట్లాడుతూ త్వరితగతిన మా గ్రామంలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సాధ్యమైనంతవరకు త్వరితగదన  అర్హులకు అందజేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని మరియు స్థానిక మంత్రివర్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొమ్మ కంటి బాలనాగయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.