prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 7:54 am Digital Edition : PRAJA VANI

మొక్కలు నాటిన బిజెపి నాయకులు

మొక్కలు నాటిన బిజెపి నాయకులు

నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి జూన్ 5

జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపు మేరకు అమ్మ పేరు తో  ఒక మొక్క కార్యక్రమం లో భాగంగా పాలేరు అసెంబ్లీ నేలకొండపల్లి మండలంలో బూత్ నెంబర్ 258 లో మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి అతిథిలుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ జిల్లా ఉపాధ్యక్షుడు నకిరికంటి వీరభద్రం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  12 సంవత్సరాలు విజయవంతంగా ప్రధాని గా సేవలందిస్తున్న ప్రధానమంత్రి మోడీ పిలుపుమేరకు పర్యావరణన్నీ రక్షించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఇచ్చిన అద్భుతమైన పిలుపు “ఏక్ పేడ్ మా కే నామ్” (తల్లి పేరుతో ఒక మొక్క). మన ఇంట్లో, కాలనీలో లేదా మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే… మన కన్నతల్లి పేరు మీద ఒక మొక్కను నాటుదాం. మనం నాటే ఆ మొక్క రేపటి రోజున మనకు నీడను, ఫలాలను  అందిస్తుంది. పెరుగుతున్న కాలుష్యాన్ని, గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టి, సమృద్ధిగా వర్షాలు కురిసేలా మన వంతు బాధ్యతగా పచ్చదనాన్ని పెంచుదాం. బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు మండల ప్రధానకార్యదర్శి బాజా రామకృష్ణ, మండల ఉపధ్యక్షులు పురాణం దివాకర్, కొండా హర్షవర్ధన్,మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ షరీఫ్ ఉద్దీన్ మండల నాయకులు సూరేపల్లి జ్ఞానరత్నం, కందరబోయిన గోపి, పిట్టల సూరిబాబు, పుట్టా సత్యనారాయణ, దేశబోయిన వేణుబాబు, జిల్లా సురేష్, బానోత్ శ్రీనివాస్,sk మొయిన్ ఉద్దిన్, పోతనబోయిన శేషగిరి తదితరులు పాల్గొన్నారు