prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 3:14 am Digital Edition : PRAJA VANI

మృతుడి కుటుంబానికి సర్పంచ్ చేయూత*  50 కిలోల బియ్యం పంపిణీ.

*మృతుడి కుటుంబానికి సర్పంచ్ చేయూత*

 

50 కిలోల బియ్యం పంపిణీ.

 

చెన్నారావుపేట మార్చి 7 (ప్రజావాణి)

 

 

మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన గ్రామ పెద్ద బర్ల దేవదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి, మానవతా దృక్పథంతో స్పందించి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వగా, కాలనీవాసులు ఆ కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెండో పెద్దమనిషి కొంకటి రవి, వార్డు సభ్యులు కొమ్ముల పూల బాబు, కందిక సునీల్, బొల్లపల్లి మల్లస్వామి, జంగిలి సమ్మయ్య, కందిక ప్రవీణ్, పృథ్వీరాజ్, జంగిలి ఏసోబు, బారపాక నవీన్, మందుల సాగర్, ఆకులపల్లి సుదర్శన్, సాదు రవి, మిల్కర్ తదితరులు పాల్గొన్నారు.