ఎండపల్లి మండలం కేంద్రానికి చెందిన తొట్ల మధూకర్ శుక్రవారం రాత్రి ట్రాక్టర్ పైనుంచి కిందపడి మృతిచెందాడు. విషాదంలోనూ మధూకర్ తండ్రి లచ్చయ్య సాహసోపేత నిర్ణయం తీసుకుని, కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకువచ్చారు. శనివారం ఉదయం వెలుగటూర్ ఎస్సై ఉదయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మధూకర్ కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. యువకుడి కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు.