* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ దారి దీపం జయశంకర్ తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ పుట్టుక నీదిచావు నీదిబతుకంతా తెలంగాణదిఅనే చందాన జయశంకర్ జీవితం సాగింది తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ సారథి కేసీఆర్ కి గురుతుల్యులు జయశంకర్ తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దిక్సూచి వారి సేవలను గుర్తిస్తూ జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మేనేజర్ జి రాజిరెడ్డి కౌన్సిలర్స్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
