
వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే11) మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరెడ్డి పల్లి గ్రామం లో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మైదుకూరు సి.ఐ రమణా రెడ్డి మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరెడ్డి పల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామస్తులకు గ్రామ సభ లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మైదుకూరు సి.ఐ రమణారెడ్డి మాట్లాడుతూ.సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు.సామాజిక అంశాలు చీటింగ్,ఫ్యాక్షన్, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు వివరించారు. మహిళా రక్షణ:’శక్తి’యాప్ వంటి సాంకేతికతను ఉపయోగించడం మరియు మహిళలకు రక్షణ కల్పించే వివరాలు తెలిపారు. చట్టపరమైన అవగాహన: గ్రామస్తులలో చట్టంపై,గ్రామాల్లో ప్రశాంతతను కాపాడటంపై అవగాహన కల్పించడం జరిగింది.