prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 7:13 am Digital Edition : PRAJA VANI

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు**

*మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్, హరీశ్ రావుల పై తీవ్ర అభ్యంతరకరమని ఆరోపిస్తూ నిరసిస్తూ…,*
షాద్ నగర్ ప్రజావాణి జులై 14:
బీఆర్ఎస్ నాయకులు కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రజలను రెచ్చగొట్టేలా, రాజకీయ విద్వేషాలను పెంచేలా ఉన్న ఇటువంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలను ఎవరూ చేయకూడదని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

కొందుర్గ్ జడ్పీటిసీ తనయుడు రామకృష్ణ గారు ,మణయ్య మాజి  ఎంపిటీసీ కొందుర్గ్ , బందులాల్ గారు మాజి సర్పంచి రేగడి చిల్కమర్రి ,గొపాల్ నాయక్ మాజి సర్పంచి అయోధ్యాపుర్ తండ ,ప్రేమ్ కుమార్ మాజి సర్పంచ్ చెరుకుపల్లి ,జనార్థన్ గౌడ్ మాజి సర్పంచి పర్వతపుర్ దర్గా రాంచెంద్రయ్య గారు ,కోరుకొండ యాదయ్య గారు ,లింగం గౌడ్ గారు ,వార్డు మెంబర్ ప్రవీణ్ తంగెళ్లపల్లి ,పర్వత పూర్ వార్డు మెంబర్ యదయ్య గారు , బిఆర్ ఎస్ యుత్ లీడర్ శ్రీకంత్ గౌడ్ గారు ,ముత్పూర్ వార్డు మెంబర్ మల్లేశ్ గారు ,టేకుల పల్లి కృష్ణయ్య గారు మాజి వార్డు మెంబర్ ముత్పూర్ రవిందర్ గారు ,బుట్ట బలరాజ్ గారు ఉమ్మెంత్యాల్ బిఆర్ ఎస్ నాయకులు శ్రీకంత్ గారు ,కార్తిక్ రెడ్డి గారు పాల్గోన్నారు