prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 12:51 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మాలేపాటి సునీల్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది

ప్రజావాణిన్యూస్(మార్చి21)బద్వేలు టౌన్‌కు చెందిన మాలేపాటి సునీల్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు హాజరై, గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సునీల్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సౌహార్దంగా ముచ్చటించి, వారి భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు దేవసాని ఆదిత్య రెడ్డి గారిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, కడప నియోజకవర్గ అసెంబ్లీ పరిశీలకులు సింగసాని గురు మోహన్, మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు సాయి కృష్ణ, గోపాల స్వామి, రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు యద్ధారెడ్డి, సింగసాని శివయ్య, అనిల్ రాజు, రాజేష్, రుద్ర, చాపాటి సాయి నారాయణ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.