ఎండపల్లి మండలంలోని గుళ్ళకోట, పాతగూడూర్ విద్యుత్ సబ్ స్టేషన్లలో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు (శనివారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రాజారాంపల్లి సెక్షన్ విద్యుత్ శాఖ ఏఈ సమ్మయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుళ్ళకోట, చర్లపల్లి, కొండాపూర్, రాజారాంపల్లి, పాతగూడూర్, సూరారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని. ఈ గ్రామ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం