లక్ష్మీ, స్వేత, స్వాతి.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ముగ్గురూ ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. ఒకే స్కూల్ లో చదివారు చిన్నప్పటి నుండి ఆటలు, పాఠాలు, కష్టాలు, సంతోషాలు అన్నీ కలిసే పంచుకున్నారు.
స్కూల్ బెంచ్ నుండి కాలేజ్ దాకా, పండుగల నుండి పుట్టినరోజుల దాకా… వాళ్ల అనుబంధం ఏనాడు తగ్గలేదు. ఉద్యోగాల్లో, సంసారాల్లో బిజీ అయినా మన స్నేహం మాత్రం అలాగే ఉంది.
వాళ్ల మాటల్లో స్నేహం
మేము ముగ్గురం ఒకే క్లాస్, ఒకే బెంచ్. టీచర్ దెబ్బలు కూడా కలిసే తిన్నాం. ఈరోజు ఎక్కడ ఉన్నా రోజుకు ఒకసారి మాట్లాడుకోకుండా ఉండలేము. స్నేహం అంటే ఇదే”_ అని ముగ్గురూ చెప్పారు.
కుల, మత, డబ్బు తేడాలు లేకుండా..మనసుల కలయికే స్నేహం అని వాళ్లు నిరూపిస్తున్నారు.
ఈ Friendship Day సందర్భంగా స్వేత, స్వాతి లాంటి స్నేహాలు మరిన్ని పూయాలని కోరుకుంటూ మీ గొల్లపెల్లి లక్ష్మీ