మన ఇసుక వాహనం’ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్..
సిద్దిపేట్, ఏప్రిల్ 5, ప్రజావాణి సిద్దిపేట జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మరియు సామాన్యులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం "మన ఇసుక వాహనం" పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా ప్రజలు ఇకపై దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు. ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgmiv.cgg.gov.in ను సందర్శించి, వివరాలతో రిజిస్టర్ చేసుకొని , దరఖాస్తు సమర్పించిన తర్వాత నిర్ణీత రుసుమును ఆన్లైన్లో...