మధ్యమానేర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి
మధ్యమానేర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి.. పొత్తూర్ బ్రిడ్జిపై రైతుల భారీ ధర్నాఇల్లంతకుంట,జూలై 17(ప్రజావాణి) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్ బ్రిడ్జిపై గురువారం రైతులు, మహిళలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. మధ్యమానేర్ జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కన్నెపల్లి పంపుహౌస్లను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నందున ఆలస్యం చేయకుండా మధ్యమానేర్ నుంచి నీటిని...