మద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,54,000/- జరిమానా, ముగ్గురు వ్యక్తులకి ఒక్కొక్కరికి ఐదు (05) రోజుల జైలు శిక్ష..
సిద్దిపేట్, మార్చి 13, ప్రజావాణి సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 26 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా . 13-మార్చి- సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణ చేసి 26 మంది వ్యక్తులకి కలిపి రూ.2,54,000-...