prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 8:16 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్రజావాణి న్యూస్ : (మార్చి,08) పోరుమామిళ్ల మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రయాన్స్ టైలరింగ్ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టారు,కార్యక్రమ విశేషాలుసర్టిఫికెట్ల పంపిణీ: టైలరింగ్ సెంటర్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న రెండవ బ్యాచ్ మహిళలకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. వారి ఉపాధి అవకాశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు ఆకాంక్షించారు.మూడవ బ్యాచ్ ప్రకటన: రేపటి నుండి మూడవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ఈ వేదికపై అధికారికంగా ప్రకటించారు.


​మహిళా సత్కారం:సమాజంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పలువురు మహిళలను గుర్తించి, వారిని ఘనంగా సత్కరించారు.​ఎం.టి.ఎఫ్ క్రాఫ్ట్స్ గ్యాలరీ ప్రారంభం’మహిళలు తయారు చేసిన హస్తకళలను ప్రోత్సహించే ఉద్దేశంతో మదర్ థెరెసా ఫౌండేషన్ నూతనంగా రూపకల్పన చేసిన ఎం టి ఎఫ్  క్రాఫ్ట్స్ గ్యాలరీ” ని ప్రారంభిస్తూ ఈ సందర్భంగా లోగో ఆవిష్కరించారు.​ముఖ్య అతిథులు:ఈ కార్యక్రమంలో మదర్ థెరెసా ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటర్ అదూరి ఆరోగ్య రాణి గారు,మాజీ ఎం.పీ.టీసీ చిత్తా రోస్లీనా ఫౌండేషన్ నిర్వాహకులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి గారు, చిత్తా గిరి ప్రణీత రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు.ఈ వేడుకలో చిత్తా మేరీ ప్రజ్వల రెడ్డి, కశ్యం గురు లక్ష్మి, ఫౌండేషన్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు