మడేలేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం

  బెజ్జంకి,జూన్ 19 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మడేలేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రజక సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ వేదపండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు కోరారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు,గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ గణపతి హోమం నిర్వహించినట్లు రజకసంఘం నిర్వాహకులు...