prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మండే వేసవిలో మానవత్వం మిద్దెల గ్రామంలో చలివేంద్రం దగ్గర ప్రతిరోజు మజ్జిగ ప్రారంభం ఏ.ఓబయ్య ఏ. ఈ.ఓ

 

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) కాశినాయన మండలం మిద్దెల గ్రామంలో వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తుల దాహర్తిని తీర్చేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రా దగ్గర మజ్జిగ ఈరోజు వైయస్సార్సీపి నాయకుడు పాలకులను జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న తరుణంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ.ఓబయ్య ఏ.ఈ. ఓ.పి చిన్న గురయ్య ఫార్మసిస్ట్ .వై రాజేంద్ర ఆర్టీసీ డ్రైవర్. చలివేంద్రాన్ని మజ్జిగ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.మిద్దెల గ్రామంలో చలివేంద్రం దగ్గర మజ్జిగ ఏర్పాటు చేయడం వల్ల ప్రజ లు,ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అలాగే నీటిని వృధా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో.వై. కృష్ణ.ఫీల్డ్ అసిస్టెంట్ గురయ్య,అభిలాష్, కక్కయ్య ,ఓబులేసు, చిన్నారాయణ.,ఓబయ్య,వై జి వెంకటయ్య వై చంటి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.