prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:01 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మాయాజాలం.సొంత వాహనాన్ని గవర్నమెంట్ వాహనంగా మార్చిన ఘనులు.

నెల్లూరు జిల్లా జూన్ 02 ప్రజావాణి చిల్లకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అంటూ స్టిక్కర్ వేయించుకొని మోటార్ వెహికల్ యాక్ట్ ను అవమానిస్తూ.దర్జాగా తిరుగుతున్నారు.నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని స్టిక్కర్ వేయించుకోవడానికి అనుమతి ఎవరు ఇచ్చారో అర్థం కాని అయోమయ స్థితిలో మండల ప్రజానీకం.చట్టాలను పరిరక్షించాల్సిన అధికారులే చట్టాలను ధిక్కరిస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నలు మొదలవుతున్నాయి.నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని రాయడానికి ఏమీ అనుమతులు ఉన్నాయి.ఆ విషయాన్ని R.T.O కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పంపేయోచనలో మండల ప్రజానీకం ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని రాయడానికి హక్కు ఎవరు ఇచ్చారు అన్న విషయాన్ని విచారణ జరిపించి ప్రజలకు చట్టాల మీద ఉన్న నమ్మకాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నా