prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 7:22 am Digital Edition : MEERASAHAB CHILUKUR

మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

చిలుకూరు మార్చి14(ప్రజావాణి*):చిలుకూరు మండల కేంద్రంలోని వివిధ కుటుంబాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు. జేర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు చవ్వ మల్లయ్య  అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసంలో ఆయనను కలిసి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన యంయంఎఫ్ మేము సైతం ఫౌండేషన్ సలహాదారు షేక్ నాగుల్ పాషా  తల్లి మహబూబి మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.అనంతరం మండల కేంద్రంలోని రామచంద్రనగర్ గ్రామానికి చెందిన  నాయకులు బుడిగం సత్యం  తల్లి భద్రమ్మ  మృతి చెందడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. విరి వెంట మండల అధ్యక్షులు జానకి రామాచారి,తాళ్ళురి శ్రీనివాస్ రామచంద్ర నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగం కిషోర్

,ఉప సర్పంచ్ దోంగరి సోమయ్య, లక్ష్మయ్య,బుడిగం కిరణ్, సతీష్  పాల్గొన్నారు.

Skip to PDF content