prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:20 pm Digital Edition : RAKESH PEDDAPALLY

భారీ వర్ష బాధితులను తక్షణమే ఆదుకోవాలి ఏఐటీయూసీ డిమాండ్

 

• నిరాశ్రయులకు ఉచితంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించాలి

• బాధితులకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయం అందించాలి

• పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలి

• తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు: నగర నేతలు హెచ్చరిక

రామగుండం జూలై 30 ప్రజావాణి:

రామగుండం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇళ్లు, గోడలు కూలి తీవ్రంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) రామగుండం నగర సమితి డిమాండ్ చేసింది. గురువారం ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఉచితంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’.. రూ. 50 వేల సహాయం

వర్షాల ధాటికి ఇళ్లు కోల్పోయి రోడ్డున పడిన నిరుపేదలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉచితంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించి ఇవ్వాలని నాయకులు కోరారు. ఇళ్లు, గోడలు కూలి నిరాశ్రయులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సాయం అందించి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పునరావాస కేంద్రాలు.. ఉచిత ఆహార పంపిణీ

ఇళ్లు కూలి సర్వస్వం కోల్పోయిన బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నేతలు స్పష్టం చేశారు. తాత్కాలికంగా వారికి అన్నదానాలు నిర్వహించడంతో పాటు బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం

అంతులేని వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతన్నకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పూర్తి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు

ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. బాధితులకు తగిన సహాయం అందించడంలో అలసత్వం వహిస్తే, వారి తరఫున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్‌లు హెచ్చరించా