భారీ వర్షాలతో సోంపూర్ – హుంసా లోలెవెల్ బ్రిడ్జి రోడ్డుపై రాకపోకల నిషేధం.

పోతంగల్/ప్రజావాణి:-ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పోతంగల్ మండలంలోని సోంపూర్,సాలూర మండలంలోని హుంసాకు వెళ్లే లోలెవెల్ బ్రిడ్జిపై వరద నీరు భారీ ఎత్తున ప్రవహించే అవకాశం ఉందని.ప్రమాదాల నివారణకై ఈ రోడ్డును బ్లాక్ చేసినట్లూ పోతంగల్ మండల ఎమ్మార్వో సందీప్ పేర్కొన్నారు.గురువారం ఆయన ఎస్ఐ శ్రీనివాస్ తో కలిసి సోంపూర్ శివారును పరిశీలించారు.ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నివారించేందుకు రోడ్డును బ్లాక్ చేయాలని ఆయన పోతంగల్ ఎంపీడీవో,సోంపూర్ సర్పంచ్,కార్యదర్శిలకు సమాచారం ఇచ్చినట్లూ తెలిపారు. ముందస్తు సమాచారం నిమిత్తమై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన చరవాహిని ద్వారా సాలురా తహసీల్దార్ కు కోరినట్లు తెలిపారు.