prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 6:09 am Digital Edition : PRAJA VANI

బ్లాక్ మెయిలింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మట్ట అవతార్ మెహర్ బాబా గౌడ్ అరెస్ట్* 

*బ్లాక్ మెయిలింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మట్ట అవతార్ మెహర్ బాబా గౌడ్ అరెస్ట్*

 

ప్రజవాణి ప్రతినిధి దేవీపట్నం ఫిబ్రవరి 8

 

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో నేను తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటూ పలువురు అధికారులను పలువురు వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకున్న దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేటకు చెందిన మట్ట అవతార మెహర్ బాబా గౌడ్ పాపం నేటికి పండింది.. నిన్న రాత్రి రంపచోడవరం పోలీసు వారు ఒక కేసు విషయమై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ వారి సమస్త చే దొంగ ఐడీ కార్డు తయారు చేయించుకుని పలువురు అధికారులను ప్రజలను నాయకులను నమ్మి మోసం చేస్తుండపై రంపచోడవరం ప్రాజెక్టు అధికారి వారి ఆదేశాలుమేరకు కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. మెట్రో ఉదయం పేపర్ విలేకరునంటూ, తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అంటూ, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడునంటు పలు అవతారాలు ఎత్తిన మాట్టా అవతార మెహర్ బాబా గౌడ్ పాపం నేడు పండిందని వారి బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ మెహర్ బాబా గౌడ కు ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువగా ఉందని గతంలో పలువురు ఆడవాళ్ళ కాపురాలు కూల్చాడని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయి భర్త పిచ్చివాడయ్యాడని ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు అంటున్నారు. ఆయన బాధితులు… అయితే దేవీపట్నం మండలం నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఇతగాడి ఆగడాలు ఎక్కువయ్యాయని ఇతగాడు ఒక మోసగాడు అని ఇతడిని ఏజెన్సీలో గిరిజనులు ఎవరు నమ్మవద్దని సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఏదేమైనా ఇలాంటి వ్యక్తి సమాజంలో ఓ కామాంధుడిగా, ఓ చీడపురుగులా, ఓ బ్లాక్ మెయిలర్ గా వ్యవహరిస్తూ పలువురు మానసిక వ్యధ కూ కారకుడు అయ్యాడు అంటూ అంతేకాకుండా ఇతగాడు దొంగ గౌడు ఎస్టీ సర్టిఫికెట్ కూడా తయారు చేయించి పలు ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి పోలీస్ కస్టడీలోనే మంచిదని అతడికి కనీస బేయిల్ కూడా ఇవ్వరాదని ఆయన బాధితులు ప్రభుత్వాన్ని కోరుకున్నారు.. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సమగ్రంగా ఆలోచించి ఇతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలియజేశారు.