prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:37 pm Digital Edition : PRAJA VANI

బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం

*బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం*

మేడిపల్లి జూన్ 26( మన ప్రజావాణి)బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కట్ట బాల్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులు పిసాటి అంజి రెడ్డి గారిని ప్రహల్లాద రెడ్డి జనరల్ సెక్రెటరీ ప్రభాకర్,ట్రెజరర్ ఆనంద్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి,లక్ష్మణ్ గౌడ్.ఈ కార్యక్రమానికి గ్రూపుకు అనుబంధంగా ఉన్నారు రసాల వెంకటేష్ యాదవ్,
జడగ మల్లయ్య (పెద్ద గొల్ల) తోటకూర వెంకటేశ్ యాదవ్,
రాంబాబు,వెంకటేశ్వరరావు భాస్కర్ చారి,తిరుపతి రెడ్డి, మల్లన్న,సత్యనారాయణ, మల్లికార్జున్,తిరుపతి రెడ్డి.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్కులో ప్రతి డెవలప్మెంట్ కు నేను రిటైర్మెంట్ అయి ఉన్న కాబట్టి  అధికారుల దృష్టికి వెళ్లి పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది, పార్కులో వ్యాయామం నడక వల్ల ఆరోగ్యం మన చేతుల్లో ఉంటదని నడక జీవితాన్ని నిలబెడుతుందని ఈ వాకర్స్ అసోసియేషన్ వల్ల ఒకరికి ఒకరు అనుబంధాలు ప్రేమలు ఏర్పడడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకు మన కుటుంబ సభ్యులకు అన్యోన్యత ఆత్మీయత కలుగుతుందని జీవితంలో నడక అనేది జన్మించినప్పటి నుంచి జన్మ అంతమయ్యే వరకు నడక లేనిదే జీవితం లేదని ఇలాంటి పార్కులను ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయని పలువురు వాకర్లు తెలియజేశారు.