prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:23 am Digital Edition : MEERASAHAB CHILUKUR

బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మ దగ్ధం హెయమైనా చర్య*

  1. *చిలుకూరు జూలై 11(ప్రజావాణి*): మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడం తగదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకి రామాచారి అన్నారు. శనివారం మండలంలోని బేతవోలు గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా దాటవేయడం సరికాదని మండిపడ్డారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం మాకు కూడా తెలుసు అని అలాంటి చర్యలు మంచివి కావని మేము సామరస్య ధోరణితో సవాలు విసిరితే చర్చకు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని విలేకరుల సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో నాయకులు తాళ్లూరి శ్రీను ,గోపి తదితరులు పాల్గొన్నారు.