prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బైబిల్ మిషన్ గుత్తి చర్చిలో చిన్న పిల్లలకు ఘనంగా అక్షరాభ్యాస మహోత్సవం: ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రెసిడెంట్ డా. జె. అద్భుతకుమార్

గుత్తి:జూలై 13 ప్రజావాణి ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అత్యంత భారీ చర్చిగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక’వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్న గుత్తి బైబిల్ మిషన్ చర్చి మళ్లీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక,విద్యా కార్యక్రమానికి వేదికైంది.సమాజంలో అక్షరజ్ఞానం పెరగాలని,చిన్న పిల్లలు ఉన్నత చదువులు చదివి దేశానికి మంచి భవిష్యత్తును అందించాలనే సత్సంకల్పంతో చర్చి నందు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస (విద్యారంభ) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలో బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు డా.జె.అద్భుతకుమార్ అయ్యగారు స్వయంగా పాల్గొని చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యగారు ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ,చేతితో స్లేటు (పలక) పట్టించి అక్షరాలను దిద్దించారు.లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానాన్ని కూడా చిన్నతనం నుంచే అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.పిల్లల నొసటన అక్షర రూపాన్ని దిద్ది, వారి విద్యా ప్రయాణానికి ఘనమైన పునాది వేశారు.
పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్రార్థనలు
అక్షరాభ్యాసం అనంతరం అయ్య పిల్లలందరి తలలపై చేతులు ఉంచి ప్రత్యేకంగా ప్రార్థించారు.జ్ఞాన వివేకాలు:పిల్లలకు చదువులో శ్రద్ధ,మంచి ఏకాగ్రత,ఉన్నతమైన బుద్ధి కలగాలని దేవుడిని వేడుకున్నారు.
ఆరోగ్య రక్షణ:చిన్నారులందరూ ఎలాంటి అనారోగ్యాలు,దుష్ట శక్తుల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.సన్మార్గం:సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి,తల్లిదండ్రులకు,చర్చికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రుల ఆనందం
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గుత్తి చర్చిలో,అది కూడా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారి పవిత్ర హస్తాల మీదుగా తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడం పూర్వజన్మ సుకృతమని తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయ్యగారి ప్రార్థనలు తమ పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగును నింపుతాయని వారు నమ్మకం వెలిబుచ్చారు. ఈ విద్యాసంబంధిత ఆధ్యాత్మిక కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొని చిన్నారులను దీవించారు.