

బెజ్జంకి,ఏప్రిల్ 2(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, ఏకశిలా కొండపైన వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శకకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల నిర్వహణలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య ముఖ్య పాయింట్లలో మోపు (తాడు సహాయంతో )పోలీస్ బందోబస్తుతో పోలీసులు పహార మధ్య ఎడ్ల బండ్లు, ట్రాక్టర్,ఆటోలు,ఇతరత్ర వాహనాలు గుట్ట చుట్టూ నిర్వహించిన ఆకర్షణలు ప్రజలకు మనోహరంగా అనిపించాయి.ఈ యొక్క ముఖ్యమైన జాతరలో మేకల బండి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.పోలీసుల కఠిన పహార, ముందస్తు భద్రతా ఏర్పాట్ల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఉత్సవం విజయవంతంగా ముగిసింది. ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.