బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆహ్వానం
బెజ్జంకి, మార్చి 27(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
శుక్రవారం ఆలయ దేవస్థాన చైర్మన్ జెల్ల ప్రభాకర్, కమిటీ సభ్యులు కలిసి మంత్రిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్చి 25 నుండి ఏప్రిల్ 9 వరకు జరగనున్న బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి జాతరకు హాజరుకావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రావుల నరసయ్య, నారాయణరెడ్డి, డి.వి. రావు తదితరులు పాల్గొన్నారు.ప్రతి సంవత్సరం ఈ జాతర మహోత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.