prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 8:46 am Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి గ్రామంలో వైకుంఠ రథం అందజేత

బెజ్జంకి గ్రామంలో వైకుంఠ రథం అందజేత

 

బెజ్జంకి, ఏప్రిల్ 2(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి చెందిన పుర్మ కుటుంబ సభ్యులు తమ సామాజిక బాధ్యతను చాటుతూ సుమారు రూ.3 లక్షల వ్యయంతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామపంచాయతీకి అందజేశారు.పుర్మ కుటుంబ సభ్యులు ఈ వైకుంఠ రథాన్ని బెజ్జంకి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్,పాలకవర్గానికి అధికారికంగా అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక ఐక్యతకు,సేవాభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్,స్థానిక ఎస్సై బోయిని సౌజన్య,ఉప సర్పంచ్ దుమాల మహేష్,గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.