prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 10:22 am Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి క్రాసింగ్ వద్ద బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన స్వాగతం పలికిన -బెజ్జంకి మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు

 

బెజ్జంకి, మే 18 (ప్రజావాణి)

మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన అనంతరం తొలిసారిగా కరీంనగర్‌కు విచ్చేసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో భాగంగా తనపై నమ్మకంతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని అన్నారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘ నాయకులుతదితరులు పాల్గొన్నారు.