బస్వాపూర్ లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా ములుగు, ఏప్రిల్ 14, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంగళవారం రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నో వివక్షతలకు గురై నేడు భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకునిపోవడం మన బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , వార్డు సభ్యులు, గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.