prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 7:42 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్: శ్రీ సత్యసాయి పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే – బాల వికాస్ శిక్షణే విద్యార్థుల విజయ రహస్యం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) బద్వేల్:స్థానిక శ్రీ సత్యసాయి విద్యా సంస్థలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు పాదపూజ కార్యక్రమంలో బాల వికాస్ తరగతుల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బాల వికాస్ తరగతుల వల్ల కలిగే ప్రయోజనాలు:ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు అతిథులు మాట్లాడుతూ,ప్రతి ఆదివారం పాఠశాలలో నిర్వహించే బాల వికాస్ తరగతులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు.​విలువల విద్య:కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా.సత్యం,ధర్మం,శాంతి,ప్రేమ,అహింస అనే పంచ సూత్రాలను బాల వికాస్ ద్వారా విద్యార్థులు వంటబట్టించుకుంటున్నారు.​నైతిక వికాసం చిన్నతనం నుండే ప్రార్థనలు,శ్లోకాలు,మరియు నీతి కథల ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత,క్రమశిక్షణ మరియు పెద్దల పట్ల గౌరవం పెరుగుతున్నాయని పేర్కొన్నారు.సేవా దృక్పథం,ఈ తరగతుల వల్ల విద్యార్థులు స్వార్థం వీడి,సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారని అతిథులు కొనియాడారు.​ముఖ్య అతిథుల ప్రశంస:కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ హరి కిరణ్,ప్రసాద్,మరియు హేమలత మేడమ్ మాట్లాడుతూ.ప్రతి ఆదివారం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి,వారికి సంస్కారవంతమైన బాల వికాస్ బోధనలు అందించడం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత. ఈ శిక్షణ వల్లే నేడు విద్యార్థులు ఇంతటి భక్తిశ్రద్ధలతో తల్లిదండ్రులకు పాదపూజ చేయగలి”అని పాఠశాల ప్రిన్సిపాల్ పునగాని రమణ,ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలలో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.రేపటి సమాజానికి ఆదర్శవంతమైన పౌరులను అందించడమే మా బాల వికాస్ మరియు సత్యసాయి విద్యా సంస్థల ప్రధాన లక్ష్యం.