స్వచ్ఛ సర్వేక్షన్ ప్రజావాణి న్యూస్(మార్చి31),మన బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణాన్ని హరిత వనంగా మార్చేందుకు మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతోంది.గౌరవనీయ మున్సిపల్ కమీషనర్ గారి నేతృత్వంలో పట్టణమంతటా పచ్చదనం పరిఢవిల్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది.కార్యక్రమ విశేషాలు,హరిత లక్ష్యం,పాత మొక్కల సంరక్షణతో పాటు,పట్టణంలోని ప్రధాన రహదారుల డివైడర్లలో పెద్ద ఎత్తున కొత్త మొక్కలు నాటడం.అధికారుల భాగస్వామ్యం,ఈ కార్యక్రమంలో డి.ఈ.ఈ. సి.సుమన్ రెడ్డి గారు పాల్గొని,మొక్కలు నాటడంలో తన వంతు సహకారాన్ని అందించారు.పర్యావరణ హితం,స్వచ్ఛమైన గాలి,ఆహ్లాదకరమైన వాతావరణమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతోంది.మొక్కలు నాటడం అంటే కేవలం గుంత తీయడం కాదు.రేపటి తరానికి ప్రాణవాయువును అందించడం.పట్టణ ప్రజలకు విన్నపం,పచ్చని బద్వేల్ పరిశుభ్రమైన బద్వేల్ సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా,మీ ఇంటి పరిసరాల్లో కనీసం ఒక మొక్క నాటండి.నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోండి.పర్యావరణ పరిరక్షణలో మీ వంతు సహకారాన్ని అందించండి.మన బద్వేల్ మన పచ్చదనం,కమీషనర్,బద్వేల్ పురపాలక సంఘం.