ప్రజావాణి (మార్చి 14)బద్వేలు టౌన్ ఆర్య వైశ్య సంఘం నాయకులు కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సంఘానికి సంబంధించిన పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.మంచూరు,సూర్యనారాయణ రెడ్డి గారు సంఘం నాయకుల సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం డిసిసి బ్యాంకు ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ గారిని మరియు ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య గారిని శాలువాతో ఘనంగా సత్కరించారుఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య,దిడుపూర్తి సుబ్బరాయుడు, శ్రీలక్ష్మీనారాయణ ప్రసాద్, జి వెంకటేశ్వర్లు, మెంటా శ్రీను, పి సురేంద్ర, చిందుకూరు సాంబశివయ్య, దాసరి జయరామయ్య, గోపాల్ నాగరాజు, మాలపాటి వెంకటేశ్వర్లు, తుమ్మలపెంట వెంకటసుబ్బయ్య, గురుమి శ్రీనివాసులు, జూటూరి సురేష్, కొప్పరపు శ్రీనివాసులు, రమణ, తులసి వెంకటసుబ్బయ్య, బొచ్చు సుబ్బారాయుడు, సుబ్బారావు, గ్రంధి నాగార్జున, చిందుకూరు సుందరయ్య, హరి మనోజ్, ప్రవీణ్ కుమార్, దేవతి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.