prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 11:45 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో అగ్నికి ఆహుతై మరణించిన 10 కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ KVPS జిల్లా కమిటీ

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మార్చి 10) రాయచోటి ;అధ్యక్షు కార్యదర్శి బండి జకరయ్య రఘు మరణించిన కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి.  మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయాలి.ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో రాయవరం గ్రామం రోడ్డు పక్కన టిప్పర్ ఢీ కొట్టి నా ప్రవేట్ బస్సు సంఘటన పై రాష్ట్రంలో ఎక్కడో చోట సంఘటనలు జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎక్కడున్నారో తెలియదని జరుగుతున్న సంఘటన అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. మినిస్టర్ ఉన్నా ఒక రాయచోటికే పరిమితమై ఉన్నాడు. ఈయన మినిస్టర్ గా ఉన్నట్లు ఎక్కువ జిల్లాలకు ప్రజలకు తెలియదు ప్రభుత్వం ఉందా అని అనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై పీడియాట్ కేసులు నమోదు చేయాలని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం నుండి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని యాజమాన్యంపై క్రిమినల్ యాక్టర్ నమోదు చేయాలని యాజమాన్యం జైలు పంపాలని ఇంకా మీదట ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కు స్వీడు మీటర్ను ఏర్పాటు చేయాలని 60 కిలోమీటర్లు స్పీడు ఉంచకూడదు అని ప్రైవేట్ బస్సులన్నిటికీని లాక్ చేయాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులు లాక్ చేయని బస్సులన్నిటిని సీల్ చేయాలని యాజమాన్యపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా రాత్రి 11:00 నుండి 12 గంటలు లోపల బయలుదేరి అత్యధిక స్పీడుతో 120 నుండి 150 కిలోమీటర్ల స్వీడుతో వెళ్లడం వల్ల అతివేగం వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్ర మొత్తంలో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ ఒకచోట జరుగుతున్నాయి. జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు మిగతా రోజులు నిద్రపోతున్నారు. రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి అధికారులు మాట్లాడం సిగ్గుచేటు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కూడా చేయడం లేదని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిరక్షణ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాత్రుల్లో ప్రైవేటు బస్సులు అన్నిటి మీద నిఘా ఏర్పాటు చేయాలని అధికారులు బాధ్యత ఇతంగా సంఘటన జరిగిన చోట సంబంధించిన అధికారులు అందర్నీ ఉద్యోగాలు నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.