ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడు అదృశ్యం

ఘట్‌కేసర్, జూలై 19: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోదేశపల్లి గ్రామానికి చెందిన మింకూరి కోమల తన కుమారుడు ఎం. రాకేష్ (32) కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. రాకేష్ గత మూడు సంవత్సరాలుగా ఘట్‌కేసర్ మండలం బాలాజీనగర్‌లోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో అద్దెకు ఉంటూ, నీలిమ ఆసుపత్రిలో స్టోర్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ ఉదయం తల్లితో ఫోన్‌లో...